మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘దర్బార్’. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్సే రాబట్టింది. తెలుగుతో పోల్చుకుంటే తమిళ్ లో ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. అయితే అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఇప్పుడు ఈ సినిమాపై కొత్త వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త రోజురోజుకు ముదురుతోంది. దర్బార్ సినిమా వల్ల తాము కోట్లాది రూపాయలు నష్టపోయామని పంపిణీదారులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఇంటిముందు సినిమా పంపిణీదారులు ఆందోళనకు దిగారు. రజినీకాంత్ ను కలవడానికి వస్తే ఆయన అందుకు నిరాకరించారని వారు ఆరోపించారు. తమ నష్టాలను దర్శకుడు మురగదాస్, హీరో రజనీకాంత్ భరించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే విషయం పై దర్బార్ దర్శకుడు మురగదాస్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలో వినియోగదారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తన ఆఫీస్ పై కూడా దాడి చేశారని.. తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోర్టును కోరారు. మరి దీనికి హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా తెలుగులోనూ ఈ మూవీ భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే.
[custom_ad]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: