ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను మే 15వ తేదీన రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ 27వ సినిమా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. చారిత్రాత్మిక నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారు.
Dear @greatandhranews all your reporters are just a phone call away from me… they can easily confirm with me before coming up with any article … hope you don’t mislead readers again …. thank you 😊 !!!! https://t.co/jz7pnGpFTm
— Harish Shankar .S (@harish2you) February 4, 2020
[custom_ad]
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత పవన్ 28వ సినిమా హరీష్ శకంర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కథపై అప్పుడే పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. పవన్ ఇమేజ్ కి సరిపోయే ఓ రీమేక్ సబ్జెక్టునే హరీష్ శంకర్ చూస్తున్నారని పలు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన హరీష్ క్లారిటీ ఇచ్చాడు. ఏదైనా నాపై కథనం రాసే ముందు నన్ను సంప్రదించవచ్చు కదా ఆ వార్తలని ఖండించారు. మరి ఇప్పటికైనా ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: