`ఖైదీ నంబర్ 150`, `సైరా నరసింహారెడ్డి`.. ఇలా రీ-ఎంట్రీలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా ఓ ప్రత్యేక గీతంలో సందడి చేస్తోందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోందని తెలిసింది. దాదాపు రూ. 20 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దిన స్పెషల్ సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ ని పిక్చరైజ్ చేస్తున్నట్లు వినికిడి. చిత్రంలో కీలక సందర్భంలో వచ్చే ఈ ఘట్టాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. కాగా, ఆగస్టులో ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: