పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అచ్చొచ్చిన స్వరకర్తల్లో యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి మూడు చిత్రాలు `జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది` సంచలన విజయం సాధించాయి. నాలుగో సినిమాగా వచ్చిన `సర్దార్ గబ్బర్ సింగ్` ఆశించిన విజయం సాధించకపోయినా.. దేవిశ్రీ బాణీలు అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. స్వల్ప విరామం తరువాత పవన్, డీఎస్పీ కాంబోలో మరో చిత్రం రానుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `గబ్బర్ సింగ్` తరువాత పవన్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడని టాక్. త్వరలోనే రాక్ స్టార్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి.. `గబ్బర్ సింగ్` తరువాత పవన్, హరీష్, దేవిశ్రీ కాంబోలో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అంతకుమించిన ఫలితాన్ని అందుకుంటుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: