ఈ ఏడాది సంక్రాంతికి `దర్బార్`తో సందడి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్… ప్రస్తుతం `శౌర్యం` శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతమందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ఆ మధ్య `అన్నాథ` అనే టైటిల్ వినిపించింది. తాజా సమాచారం ప్రకారం.. `మన్నవన్` అనే టైటిల్ ని ఫిక్స్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందని తెలిసింది. త్వరలోనే టైటిల్ పై క్లారిటీ వస్తుంది. రజినీకాంత్ 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాదం కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: