మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం `డిస్కో రాజా`, `క్రాక్` చిత్రాలతో బిజీగా ఉన్నారు. `డిస్కో రాజా` ఈ నెల 24న రిలీజ్ కానుండగా.. `క్రాక్` వేసవిలో విడుదల కానుంది. ఈ లోపే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. `రాక్షసుడు`తో విజయాన్ని అందుకున్న దర్శకుడు రమేష్ వర్మ.. తన తదుపరి చిత్రాన్ని రవితేజతో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. `రాక్షసుడు` తరహాలోనే ఇది కూడా ఓ తమిళ సినిమా ఆధారంగా రూపొందుతుందని టాక్. అంతేకాదు… `క్రాక్` చిత్రీకరణ పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో `వీర` (2011) తరువాత వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ కాంబినేషన్ మూవీపై మరింత స్పష్టత వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: