మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన దర్శకుల్లో ఎ. కోదండరామిరెడ్డి ఒకరు. వీరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి ఈ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం `ముఠామేస్త్రీ`. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకి జోడీగా మీనా, రోజా నటించగా శరత్ సక్సేనా, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, జేవీ సోమయాజులు ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
రాజ్ – కోటి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ జనాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. `ఈ పేటకు నేనే మేస్తిరి`, `అంజనీ పుత్రుడా`, `ఎంత ఘాటు ప్రేమయో`, `జోరుగున్నాది` గీతాలు మాస్ ని ఉర్రూతలూగించాయి. కేసీ శేఖర్ బాబు, డి. శివ ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం..`ఉత్తమ నటుడు`గా చిరంజీవికి నాలుగో `ఫిల్మ్ ఫేర్` పురస్కారాన్ని అందించింది. 1993 జనవరి 17న విడుదలైన `ముఠామేస్త్రీ`… నేటితో 27 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: