టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ లతో దూసుకుపోతున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకదాని తర్వాత ఒకటి హిట్స్ ఇస్తూ అటు అభిమానులను సైతం ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 50 కోట్ల క్లబ్ లో కి చేరిన ఈ సినిమా భారీ పోటి ఉన్నా నాలుగో రోజు కూడా 8 కోట్లకు పైగా షేర్ సాధించి సత్తా చాటింది. అల వైకుంఠపురములో సినిమా గట్టి పోటి ఇస్తున్నా మహేష్ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఇక మొదటి నాలుగు రోజుల్లో టోటల్ షేర్ చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 56 నుంచి 59 కోట్లుగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 73 నుంచి 77 కోట్లు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని టీమ్ అంతా కలిసి సక్సెస్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసాయి. ఈ నేపథ్యంలోనే హన్మకొండలో ఈ నెల 17వ తేదీన బ్లాక్ బస్టర్ కా బాప్ సెలెబ్రేషన్స్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించి సెలెబ్రేట్ చేసుకోనున్నారు.
కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించింది. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మించాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: