సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టింది . మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో తన మనసులో మాటను వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ… బ్లాక్ బస్టర్స్ “శ్రీమంతుడు”, “భరత్ అనే నేను”, మహర్షి” వంటి స్క్రిప్ట్ ఓరియెంటెడ్ సీరియస్ మూవీస్ లో నటించానని , సూపర్ డూపర్ హిట్ “దూకుడు” వంటి ఎంటర్ టైనర్ మూవీ లో నటించడానికి ఎదురు చూస్తున్నానని, తాను “మహర్షి” మూవీ షూటింగ్ లో ఉన్నపుడు అనిల్ రావిపూడి “సరిలేరు నీకెవ్వరు” మూవీ గురించి 40 మినిట్స్ నరేట్ చేశారని, తనకు నచ్చిందని, అనిల్ రావిపూడి రూపొందించిన “F 2” మూవీ ని తన కుటుంబ సభ్యులతో చూసి ఎంజాయ్ చేశానని, 3 నెలలలో అనిల్ స్క్రిప్ట్ రెడీ చేసి జులై 2వ తేదీ ఫుల్ స్క్రిప్ట్ నరేట్ చేశారని, “సరిలేరు నీకెవ్వరు” మూవీ జులై 4వ తేదీ షూటింగ్ ప్రారంభమై డిసెంబర్ 18 వ తేదీ కంప్లీట్ అయ్యిందని, “సరిలేరు నీకెవ్వరు” మూవీ లో నటించే నిర్ణయం తన సినీ కెరీర్ లోనే బెస్ట్ నిర్ణయం అని, ఫ్యాన్స్ తనను కొత్త తరహా గా చూడాలనుకొంటారని తనకు తెలుసు అని , అనిల్ రావిపూడి ఎనర్జిటిక్ డైరెక్టరని, 13 సంవత్సరాల తరువాత నటించడానికి విజయశాంతి గారిని కన్విన్స్ చేసిన ఘనత అనిల్ దే నని, రష్మిక న్యూ జనరేషన్ అమ్మాయని, ఫ్రెష్ నెస్ తో కూడుకున్న సెటిల్డ్పర్ ఫార్మెన్స్ చేసిందని , దేవిశ్రీ ప్రసాద్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అని, దేవిశ్రీ స్వరపరిచిన మైండ్ బ్లాక్ సాంగ్ ను తన అభిమానులు థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: