అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలివుంది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి. దీనితో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్, ట్రయిలర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంకా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో చేయబోతున్నాడో కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటది కదా. తన తర్వాత సినిమా మహర్షి సినిమాతో తనకు హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి తో అని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే చెప్పినా కొంతమందికి ఎక్కడో కొంత డౌట్ ఉండివుండొచ్చు. అయితే ఇప్పుడు ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చేసారు మహేష్. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మహేష్ తన తర్వాత సినిమా వంశీ పైడిపల్లితోనే అని కన్ఫామ్ చేశారు. మూడు నెలలు గ్యాప్ తీసుకొని.. ఆ తర్వాత కొత్త సినిమాను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: