అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్ప్రైజ్ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సాలిడ్ గా జరిగినట్టు తెలుస్తుంది. మహేష్ బాబు ప్రీ రిలీజ్ బిజినెస్లోనూ సత్తా చాటాడు. భరత్ అనే నేను, మహర్షి సినిమాలు హిట్ అవ్వడంతో ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. నైజాం హక్కులు 25 కోట్లకు అమ్ముడవ్వగా సీడెడ్ 12 కోట్లు, నెల్లూరు 3.2 కోట్లు, కృష్ణ 6.3 కోట్లు, గుంటూరు 7.5 కోట్లు, వైజాగ్ 9.6 కోట్లు, ఈస్ట్ గోదావరి 7.5 కోట్లు, వెస్ట్ గోదావరి 5.5 కోట్లు ధర పలికినట్టుగా తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 76.7 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక 8.3 కోట్లు, ఇరత రాష్ట్రాలు 1.8 కోట్లు, ఓవర్ సీస్ 13.6 కోట్లు కలుపుకుంటే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ బిజినెస్ 100.3 కోట్లకు చేరినట్టు సమాచారం. మరి చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందో…? ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో.?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: