త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ‘సామజవరగమనా’, ‘రాములో రాములా’ ‘ఓ మై గాడ్ డాడీ’ పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. రీసెంట్ గా బుట్ట బొమ్మ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ ఒక ఏతైతే తాజాగా సామజవరగమనా పాట ప్రోమో రిలీజ్ అవ్వగా.. అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. స్టయిలిష్ స్టార్ మరోసారి తన స్టైల్ తోనే కాకుండా కూల్ స్టెప్స్ తో ఎట్రాక్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ మారనున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా 12వ తేదీన రిలీజ్ కావాలి. అయితే ఒకటి లేక రెండు రోజులు ముందుకు లేక వీకెండ్ అలా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: