బ్లాక్ బస్టర్ “అలా మొదలైంది ” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన నిత్యా మీనన్ , ఆ మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకొన్నారు. నిత్యా మీనన్ నటించిన ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, S/O సత్యమూర్తి, రుద్రమ దేవి, జనతా గ్యారేజ్ , గీత గోవిందం మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమిళ, మలయాళ భాషల చిత్రాలలో బిజీగా ఉన్న ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఇప్పుడు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన “స్కైలాబ్ ” ప్రజలలో భయం , ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. 1979 సంవత్సరంలో స్కైలాబ్ కూలి పోయి వినాశనం జరుగుతుందనే వదంతులు చెలరేగాయి. హానికలుగుతుందనే భయం తో ప్రజలు కాలం గడిపారు. ఇపుడు “స్కైల్యాబ్” నేపథ్యంలో లో ఒక పీరియాడిక్ మూవీ రూపొందనుంది. సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి “, “సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ కె ఎఫ్ సి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విశ్వక్ దర్శకత్వంలో నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రలలోఒక సైన్స్ ఫిక్షన్ మూవీరూపొందనుంది. డాక్టర్ రవి కిరణ్ సమర్పణ లో పృథ్వీ పిన్నమరాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: