ఈ సంవత్సరం టాలీవుడ్ లో పలు రీమేక్స్ సందడి చేశాయి. వీటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే… కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి తెలుగు వెర్షన్ గా రూపొందిన `ఓ బేబి`(సమంత), స్పానిష్ మూవీ `ది ఇన్విజబుల్ గెస్ట్` ఆధారంగా రూపొందిన `ఎవరు`(అడివి శేష్, రెజీనా), తమిళ చిత్రం `జిగర్ తండ`కి రీమేక్ అయిన `గద్దలకొండ గణేష్` (వరుణ్ తేజ్), కోలీవుడ్ మూవీ `కణితన్` ఆధారంగా రూపొందిన `అర్జున్ సురవరం` (నిఖిల్), తమిళ చిత్రం `రాక్షసన్`కి రీమేక్ గా తెరకెక్కిన `రాక్షసుడు`(బెల్లంకొండ సాయిశ్రీనివాస్) బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే కోలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా ‘కనా’ ఆధారంగా రూపొందిన ‘కౌసల్య కృష్ణమూర్తి` (ఐశ్వర్యా రాజేష్) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా తమిళ చిత్రం ‘దిల్లుకు దుడ్డు 2’కి రీమేక్ గా హారర్ కామెడీ ‘రాజు గారి గది3’ తెరకెక్కగా… ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు`కి అనే తమిళ మూవీ ఆధారంగా అడల్డ్ హారర్ కామెడీ ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ని తీర్చిదిద్దారు. ఈ రెండు సినిమాలూ వసూళ్ళ వర్షం కురిపించాయి.
ఇక ఫ్రెంచ్ మూవీ ‘ఐ డూ’ ఆధారంగా నాగార్జున ‘మన్మథుడు 2` తెరకెక్కగా… టర్కిష్ ఫిల్మ్ ‘లవ్ లైక్స్ కో-ఇన్సిడెన్స్’ని బేస్ చేసుకుని రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే` రూపొందింది. మాలీవుడ్ మూవీ ‘ఏబీసీడీ’ ఆధారంగా అదే పేరుతో అల్లు శిరీష్ కామెడీ ఫిల్మ్ రూపొందగా… మరో మలయాళ చిత్రం ‘అంగామలె డైరీస్’కి రీమేక్ గా విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’ తెరకెక్కింది. అలాగే కన్నడ చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు`ఆధారంగా అదే పేరుతో చేతన్ మద్దినేని టైటిల్ రోల్ లో `ఫస్ట్ ర్యాంక్ రాజు` రిలీజైంది.
ఓవరాల్ గా… ఈ ఏడాది రీమేక్స్ లో విజయవంతమైన చిత్రాలతో పాటు అపజయాలు చోటుచేసుకున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: