నాగ చైతన్య తరువాత మహేష్ తోనే..!

Parasuram To Direct Mahesh Babu After Naga Chaitanya Movie

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా.. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు దర్శకుడు పరశురాం. ఇక ఈ సినిమాతో పరుసురాం కి వరుస అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. అయితే ఆ మధ్య మహేష్ బాబు, అల్లు అర్జున్ , అఖిల్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా నాగ చైతన్యతో సినిమా ఫిక్స్ అయింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇది నాగ చైతన్యకి 20వ సినిమా. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్యతో సినిమా తర్వాత మహేష్ తోనే తన సినిమా ఉంటుందని చెప్తున్నాడు పరుశురాం. నాగ చైతన్య సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు సినిమాపై వర్క్ చేస్తానని.. ఇప్పటికే స్టోరీ లాక్ అయిందని గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందని అంటున్నాడు. మరి మొత్తానికి మహేష్ తో సినిమా చేసేంతవరకూ పరుశురాం నిద్ర పోయేట్టు లేదు.

కాగా మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది చిత్రయూనిట్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =