`మన్మథుడు 2` తరువాత స్వల్ప విరామం తీసుకున్న కింగ్ నాగార్జున… త్వరలో తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించబోతున్నారు. `ఊపిరి` రచయిత సాల్మన్ తెరకెక్కించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… రియలిస్టిక్ గా సాగే ఈ కాప్ స్టోరీ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పనిచేయనున్నారని తెలిసింది. సినిమాలోని ప్రతి యాక్షన్ సీక్వెన్స్ తెలుగు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా డిజైన్ చేస్తున్నారని టాక్. అంతేకాదు… అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నే స్వయంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: