ఈ ఏడాది సంక్రాంతికి `పేట`తో పలకరించిన సూపర్ స్టార్ రజినీ కాంత్… వచ్చే సంవత్సరం ముగ్గుల పండక్కి `దర్బార్`తో సందడి చేయనున్నారు. ఈ లోపే… తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించారాయన. `శౌర్యం` శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… బుధవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం డి. ఇమాన్ స్వరసారథ్యంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఇంట్రో సాంగ్ ని … రజినీ బృందంపై చిత్రీకరిస్తున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రజినీ, ఎస్పీబీ కాంబోలో అనేక జనరంజక గీతాలు వచ్చాయి. ముఖ్యంగా… రజినీకి బాలు పాడిన పలు ఇంట్రో సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సూపర్ స్టార్ గత చిత్రం `పేట`లోనూ, విడుదలకు సిద్ధమైన `దర్బార్`లోనూ ఎస్పీబీ పాడిన పరిచయ గీతాలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మరి… కొత్త పాట కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుందేమో చూడాలి.
సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న `రజినీ 168`లో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2020 దీపావళికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: