స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `అల వైకుంఠపురములో`. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో టబు, సుశాంత్, నివేదా పెతురాజ్, జయరామ్, నవదీప్, సునీల్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `అల వైకుంఠపురములో`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన సంగతి తెలిసింది. అదేమిటంటే… వరల్డ్ లార్జెస్ట్ సినిమా స్క్రీన్ అయిన ఐమాక్స్ మెల్ బోర్న్ లో జనవరి 12న `అల వైకుంఠపురములో` స్పెషల్ స్క్రీనింగ్ ఉంటుందట. ఉదయం 7.30 గంటలకు జరిగే ఈ స్క్రీనింగ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో `అల వైకుంఠఫురములో`ని ప్రదర్శిస్తారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటనన వచ్చే అవకాశముంది.
మరి… భారీ అంచనాల మధ్య వస్తున్న `అల వైకుంఠపురములో`… బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: