హిందీ బ్లాక్ బస్టర్ `పింక్`కి తమిళ రీమేక్ గా రూపొందిన `నేర్ కొండ పార్ వై`తో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్, టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్. కట్ చేస్తే… ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్ లోనే `వలిమై` పేరుతో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాకి సంబంధించి… తొలి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుందని సమాచారం. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ నెల 13 నుంచి మొదలయ్యే ఈ షెడ్యూల్ లో… అజిత్, ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి 2020 వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి… `నేర్ కొండ పార్ వై` తరహాలో ఈ చిత్రంతోనూ అజిత్, వినోద్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి. కాగా, తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో విడుదలయ్యే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: