హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ “ఉప్పెన ” మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ మూవీ “మహానటి ” నిర్మాత స్వప్న దత్ నిర్మాణ సారథ్యంలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ రూపొందనుంది. ఆ మూవీ లో వైష్ణవ్ తేజ్ హీరోగాఎంపిక అయినట్టు సమాచారం. దర్శకుడు సుకుమార్ “ఉప్పెన ” మూవీ కి సహ నిర్మాత గా వ్యవహరిస్తూ తన శిష్యుడు బుచ్చిబాబు ను దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: