`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బన్నీకి జోడీగా రష్మికా మందన్నా నటించనుండగా… హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం… తొలి షెడ్యూల్ ని నల్లమల అడవుల్లోనూ, మలి షెడ్యూల్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ జరిపే దిశగా ప్రణాళిక రచించారట సుక్కు అండ్ టీమ్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2020 సెకండాఫ్ లో రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: