`ఛలో` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన వెంకీ కుడుముల… స్వల్ప విరామం తరువాత తన రెండో చిత్రాన్ని `భీష్మ`గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా నాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. కాగా, తుది దశకు చేరుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని 2020 ఫిబ్రవరి 21న మహాశివరాత్రి కానుకగా విడుదల చేయనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతమందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: