వరుస ప్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు సాయి తేజ్. కథలు ఎంచుకునే విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ గా మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తెరకెక్కుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా.. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత కూడా గీతా ఆర్ట్స్ లోనే తేజ్ మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తరువాత కూడా తేజూతో అల్లు అరవింద్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇది కాక మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. వాటిలో ఒక చిత్రాన్ని `వెంకటాద్రి ఎక్స్ప్రెస్`, `ఎక్స్ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనుండగా… మరో సినిమాని సుబ్బు అనే నూతన దర్శకుడు రూపొందించనున్నాడని తెలిసింది. మేర్లపాక గాంధీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుండగా… సుబ్బు కాంబినేషన్ మూవీని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం వీటిలో ఏది ఫైనల్ అవుతుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: