1986 సంవత్సరం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లో కబీర్ దుహాన్ సింగ్ జన్మించారు. జిల్ మూవీ తో టాలీవుడ్ లో ప్రతినాయకుడిగా ఎంటర్ అయ్యారు. కిక్ 2, బెంగాల్ టైగర్ మూవీస్ ద్వారా గుర్తింపు పొందారు. అజిత్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ వేదాళం తో కోలీవుడ్ కు, సుదీప్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ హెబ్బులి మూవీ తో శాండల్ వుడ్ కు ప్రతినాయకుడిగా కబీర్ సింగ్ పరిచయమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రతినాయక పాత్రలకు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా ఉన్న కబీర్ సింగ్ తన 34 వ మూవీ కి సంతకం చేసి, తన ఆనందాన్ని ప్రేక్షకులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ రోజు 34 వ మూవీ కి సంతకం చేశానని, కబీర్ 34 తెలుగు మూవీ అని, కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. కబీర్ మరిన్ని మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: