సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘జాన్’ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. యూరోప్ లో 20 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. దాని తర్వాత సాహో పనుల్లో ప్రభాస్ ఫుల్ బిజీగా మారిపోవడంతో ఆరు నెలలకు పైగా బ్రేక్ పడింది. ఇప్పుడు సాహో హడావుడి కూడా అయిపోయింది. దీనితో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. విరామం తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాలుపంచుకుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. కె.జి.యఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో తన తర్వాత సినిమా ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను కలిసి ఓ కథను వినిపించాడట. ఇక ప్రభాస్ కు కథ నచ్చి ఓకే చెప్పినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకుముందే ప్రశాంత్ నీల్ మహేష్ తో, ఎన్టీఆర్ తో కూడా చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ప్రభాస్ తో సినిమా చేయాలనీ చాలా ఇంట్రెస్ట్ గా వున్నాడట. మరి అన్నీ సెట్ అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..!
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: