మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా ‘ప్రతిరోజు పండగే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. కాగా ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా…అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ అయిపోవడంతో తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ గా షూటింగ్ ను ప్రారంభించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ను అప్పుడే ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
కాగా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: