రోజుకో పోస్ట్ తో.. రోజుకో అప్ డేట్ తో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తున్నాడు వర్మ. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతోనే సగం దుమారం రేపాడు. అక్కడితో ఆగకుండా ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్ లు రిలీజ్ చేస్తూ మరిన్ని వివాదాలకు తెరలేపుతున్నాడు. అంతే కాదు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు సీక్వెల్ తీయనున్నట్టు కూడా తెలిపాడు. టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని..ఈ సీక్వెల్ కు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ పెడతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో బాంబు పేల్చాడు వర్మ. తన తదుపరి చిత్రం ఏంటో వర్మ ప్రకటించాడు. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అయిపోయారని… ఇప్పుడు హైదరాబాద్ దాదాగిరిపై సినిమా తీయబోతున్నానని తెలిపాడు. 1980లలో హైదరాబాదులో నెలకొన్న దాదాగిరి, దాదాలపై ఈ సినిమా ఉంటుందని.. ఈ సినిమా ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కబోతోందని… ఈ చిత్రానికి ‘శివ’ సినిమానే స్ఫూర్తి అని తెలిపాడు. అంతేకాదు అప్పుడే హీరో ను కూడా ఫిక్స్ చేసేసాడు. గతంలో వర్మ తో ‘వంగవీటి’ సినిమా చేసిన.. ఇప్పుడు ‘జార్జిరెడ్డి’ తో రాబోతున్న సందీప్ మాధవ్ ను సెలెక్ట్ చేసినట్టు తెలిపాడు. మరి ఇప్పటివరకూ ఏపీ లో జరిగిన సంఘటనలు.. యదార్ధ ఘటనలను తీసుకుని సినిమాలు తీసాడు.. ఇప్పుడు తెలంగాణాలో వేలు పెడుతున్నాడు. ఇక్కడ ఎంత దుమారం రేగుతుందో చూద్దాం.
Just signed George Reddy @SandeepMadhav_ for DADAS OF HYDERABAD ..After finishing rowdies of Vijaywada and factionists in rayalaseema, am making a film on the DADA’s of the 80’s in Hyderabad ..Story is based on a real life character my inspiration for character of SHIVA pic.twitter.com/reUkxx0No8
— Ram Gopal Varma (@RGVzoomin) November 18, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: