సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా దర్శనమివ్వనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం కేరళ పరిసర ప్రాంతాల్లో ఓ పాటను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న టీజర్ను విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు… ఈ నెల 19న టీజర్ను రిలీజ్ చేసి, అనిల్ బర్త్డే స్పెషల్గా ఈ నెల 23న స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా చిత్ర బృందం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేసే విధంగానూ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి… ఈ అప్డేట్స్కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.
మహేష్కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: