మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన తన పోర్షన్ ను రజనీ పూర్తి చేశారు. ఆ తరువాత హిమాలయాలకు వెళ్లి వచ్చిన ఆయన, ఇటీవలే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవడం పూర్తయిందని, తాజాగా తన ట్విట్టర్ ద్వారా మురుగదాస్ తెలియజేశాడు. రజనీతో కబుర్లు చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్తో పాటు చెన్నై భామ నివేదా థామస్ , మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను దిల్ రాజు, NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























