`ఆర్య`(2004), `ఆర్య 2`(2009) తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ స్మగ్లర్గా దర్శనమివ్వడమే కాకుండా… చిత్తూరు యాసతో సరికొత్త లుక్లో కనిపించనున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే… ఈ యాక్షన్ థ్రిల్లర్ లోని కీలక సన్నివేశాలన్నీ అటవీ నేపథ్యంలో సాగేవి కావడంతో… ప్రస్తుతం లొకేషన్ల అన్వేషణలో ఉందట చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే… బ్యాంకాక్, థాయ్లాండ్లోని దట్టమైన అడవుల్లో లొకేషన్స్ను ఎంపిక చేసే దిశగా సుక్కు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అలాగే, ఏడాది చివరలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయబోతున్నట్లు టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటించనుంది. 2020 ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా… అదే ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లలోకి రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మరి… పదేళ్ళ తరువాత ముచ్చటగా మూడోసారి జట్టుకడుతున్న బన్నీ, సుక్కు… ఈ అప్కమింగ్ ఫిల్మ్తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: