వెండి తెరపై హీరో హీరోయిన్లకు ఫాదర్ క్యారెక్టర్ లో చేయాలంటే మనకు వెంటనే కొన్ని పేర్లు కళ్ళముందుకు వచ్చేస్తాయి. అందులో మొదట గుర్తొచ్చేది ప్రకాష్ రాజ్, ఆ తర్వాత రావు రమేష్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, నాజర్, జగపతిబాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తాయి. అయితే ఇప్పుడు వరుణ్ సినిమా కోసం ఓ యూనిక్ పెయిర్ జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకీ ఆ పెయిర్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు రమ్యకృష్, మాధవన్. వీరిద్దరూ వరుణ్ తేజ్ హీరో గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో తల్లి తండ్రులుగా నటిస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదులే కానీ నిజంగా వీరిద్దరూ కలిసి నటిస్తే మాత్రం నిజంగానే యూనిక్ పెయిర్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. ఆతర్వాత ‘నరసింహ’ సినిమాలోని నీలాంబరి పాత్రతో తనలోని మరో యాంగిల్ ను చూపించి తన రేంజ్ ను మార్చేసింది. ఇక ఇటీవల వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో శివగామిగా తార స్థాయి కి చేరుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో.. ఈ పాత్రను రమ్యకృష్ణ అయితేనే చేయగలదు అని తన కోసమే పాత్రలు రాస్తున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. మాధవన్ కూడా అంతే ఒకప్పుడు చెలి, సఖి అంటూ తన సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైనా.. మళ్ళీ ‘సవ్యసాచి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నిశ్శబ్దం’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఇప్పుడు వరుణ్ తేజ్ కు ఫాదర్ గా నటిస్తున్నాడు. చూద్దాం దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: