ఇప్పటికే పింక్ రీమేక్ ను పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది రెండు రోజుల క్రితం. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు తో పాటు బోనీ కపూర్ కూడా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. బోనీ కపూర్ ఇప్పటీకే ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అజిత్ హీరోగా ‘నెర్కొండ పారవై’ అనే పేరుతో అక్కడ రీమేక్ చేసారు. ఇక ఆ సినిమా అక్కడ హిట్ కొట్టడంతో మళ్ళీ అదే కాంబినేషన్ లో ‘వలిమై’ అనే సినిమాను కూడా చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తెలుగు రీమేక్ లో కూడా తన హ్యాండ్ వేయనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం బోనీ కపూర్ ఇటీవలే పూజా హెగ్డే ను కలిశాడట. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. పూజా హెగ్డే బోనీని కలవడంతో కొత్త వార్తలు మొదలయ్యాయి. వాటిలో అజిత్ సినిమాలో కథానాయకిగా నటించే విషయమై పూజా హెగ్డే, బోనీ కపూర్ కలిశారనేది మొదటిది. ఇంకోవైపు పవన్ హీరోగా చేయాల్సిన ‘పింక్’ రీమేక్లో పూజాను కథానాయకిగా తీసుకోవాలనే ఆలోచనలో బోనీ కపూర్ ఉన్నారనేది రెండో వార్త. మరి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: