యువ కథానాయకుడు నితిన్, కేరళకుట్టి కీర్తి సురేష్ ఫస్ట్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం `రంగ్ దే`. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి `తొలిప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో భాగంగా… నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. కాగా… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: