పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టినా… అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు పవన్. కొంతకాలం క్రితం రాజకీయరంగంలోనూ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్… అక్కడ కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే… దాదాపు రెండేళ్ళుగా పాలిటిక్స్లో బిజీగా ఉండడం వలన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్… మళ్ళీ ఇప్పుడు రీ-ఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… ప్రస్తుతం పవన్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. వాటిలో ఒకటి బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ కాగా… రెండోది క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసాడట క్రిష్. జానపద చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా… డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో థియేటర్లలోకి రానుందని సమాచారం. అంతేకాదు, ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్లో లేడీ సూపర్ స్టార్ నయనతారను కథానాయికగా నటించనున్నట్టు భోగట్టా. గతంలో క్రిష్-నయన్ కాంబినేషన్లో ‘కృష్ణం వందే జగద్గురుం’(2012) వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… ఇప్పుడు మరోసారి నయన్ పేరు వినిపిస్తుండడం ఈ చిత్రంపై ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే, తాజాగా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `సైరా నరసింహారెడ్డి`లో నటించిన నయన్… ఇప్పుడు పవన్తోనూ కలసి నటించనుండడం వార్తల్లో నిలుస్తోంది.
త్వరలోనే నయన్ ఎంట్రీతో పాటు, ఈ సినిమాకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: