`ఆర్ ఎక్స్ 100`(2018)తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు అజయ్ భూపతి. పరిమిత బడ్జెట్తో రూపొందిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్… బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో… అజయ్ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ మధ్య పలువురు యువ కథానాయకుల కాంబినేషన్స్లో అజయ్ పేరు వినిపించినా… ఇప్పటివరకు తన రెండో చిత్రం పట్టాలెక్కలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం… యువ సామ్రాట్ నాగచైతన్యతో అజయ్ సెకండ్ వెంచర్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇరువురి మధ్య చర్చలు కూడా జరిగాయని… ప్రస్తుతం అజయ్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడని టాక్. అంతేకాదు… చైతు చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తైన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని వినికిడి. అంటే… వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందన్న మాట. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జెమిని కిరణ్ నిర్మించనున్నట్టు సమాచారం.
వాస్తవానికి… `మహాసముద్రం` పేరుతో తన రెండో చిత్రాన్ని ప్లాన్ చేసినా ఆ కథకు తగ్గ హీరోలు దొరక్కపోవడంతో, దానిని తాత్కాలికంగా ఆపేసి మరో కొత్త కథాంశంతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట అజయ్. మరి… ఈ చిత్రమైనా సకాలంలో పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. `ఆర్ ఎక్స్ 100`లాగే అజయ్ సెకండ్ పిక్చర్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఆశిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: