ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘పెంగ్విన్’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఉమెన్ సెంట్రిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాహాతో పాటు కీర్తి బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రాజు సమర్పణలో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీలో కీర్తి న్యాచురల్ గ కనిపించిననున్నట్టు తెలుస్తుంది. ఇంకా టైటిల్ సెట్ చేయని ఈ సినిమాలో …ఆది పినిశెట్టి – జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
మరి ‘మహానటి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























