బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కమర్షియల్ మూవీస్ తోపాటు హిస్టారికల్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాజీరావ్ మస్తానీ మూవీ లో మస్తానీ గా అలరించిన దీపికాపడుకొనేనటించిన పద్మావత్ మూవీ ఘనవిజయం సాధించి 500కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న మహాభారత్ మూవీ లో ద్రౌపది గా నటించనున్నారు. ఇప్పుడు మరో చారిత్రాత్మక మూవీ కి దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కశ్మీర్ లోని లోహరా రాజవంశపు రాజు సింహ దేవుని కమాండర్ ఇన్ చీఫ్ రామచంద్ర తనయ , ది లాస్ట్ క్వీన్ ఆఫ్ కశ్మీర్, 13వ సెంచురీ కశ్మీర్ హిందూ క్వీన్ కోట రాణి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న మూవీ లో దీపిక నటించనున్నారు. మధు మంతెన నిర్మాణ సారథ్యంలో షకున్ బాత్రా దర్శకత్వంలో రణ బీర్ కపూర్, దీపిక జంటగా ఈ మూవీ రూపొందనుందని సమాచారం. దీపిక ప్రస్తుతం చాపాక్, 83 మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ కు దీపిక సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: