ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా తన సత్తా చూపిస్తున్నాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమా అయిన ‘ఖైదీ నెం.150’ సినిమాకు నిర్మాత వ్యవహరించి మంచి లాభాలు పొందాడు. ఇక రీసెంట్ గా భారీ బడ్జెట్ తో సైరా మూవీ ని నిర్మించి.. బడ్జెట్ విషయంలో.. క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనక్కితగ్గకుండా తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ కొత్త కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చిరు 152 సినిమా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. నవంబర్లో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుంది.ఇక ఈ సినిమాను చెర్రీ, నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక చిరుతో ఎప్పుడు సినిమాలు తీద్దామా అని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తుంన్నారు. దిల్ రాజు, మైత్రి మూవీస్, ఆఖరికి అల్లు అరవింద్ ఇలా బడా ప్రొడ్యూసర్స్ అందరూ లైన్లో ఉన్నారు. కానీ ఇదిలా ఉండగా చిరు సినిమాల విషయంలో చరణ్ ఓ నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే ఇకపై చిరు సినిమాలను చరణే నిర్మించాలనుకుంటున్నాడట. ఎవరైనా సినిమాను తీయాలనుకున్నా తనతో పాటు కో ప్రొడక్షన్స్ గా వాళ్ళు ఉండొచ్చట. అంతేకాదు వాళ్ళు కూడా ఈ కండీషన్ కు సిద్దంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చెర్రీ నిర్మాతగా కూడా బాగానే సక్సెస్ అయ్యాడని తెలుస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: