వైవిధ్య భరిత పాత్రలలో విభిన్న కథాంశాల చిత్రాలలో హీరోగా నటిస్తున్న శ్రీవిష్ణు నటించిన నీదీ నాదీ ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా మూవీస్ ఘనవిజయం సాధించాయి. సెలెక్టివ్ గా మూవీస్ లో నటిస్తున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ ఒక వినూత్న కథతో రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఒక మూవీ రూపొందనుంది. దర్శకుడు హాసిత్ సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు వివేక్ ఆత్రేయ వద్ద రచన, దర్శకత్వ విభాగం లో పనిచేశారు. నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ .. శ్రీ విష్ణు, హాసిత్ వంటి ప్రతిభావంతులతో సినిమా నిర్మించడం సంతోషంగా ఉందని, ఒక కొత్త కథ తో రూపొందే ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని, మిగతా తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: