‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్… ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో… ఈ సినిమా చేయబోతున్నాడట రామ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళనాట ఘన విజయం సాధించిన ‘తడమ్’ చిత్రానికి రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని టాక్. అలాగే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట. నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను… ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించనున్నట్టు సమాచారం. రామ్కు జోడిగా నివేదా పేతురాజ్ నటించనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కు సంబంధించి… రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: