స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘అల వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్లోని ఓ షాపింగ్ మాల్లో జరుగుతోంది. అక్కడ ఫుడ్ కోర్ట్, మాల్ నేపథ్యంలో వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం… సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: