వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా భీష్మ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే కదా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్టమస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను… సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రశేఖర్ యేలేటి, ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతో చేయనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం చంద్ర శేఖర్ యేలేటి సినిమాలో నితిన్ మిస్ ఇండియా తెలంగాణ ‘సిమ్రాన్ చౌదరి’తో జోడి కట్టనున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ వారియర్ పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సిమ్రాన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమాలో సిమ్రాన్ ను రీప్లేస్ చేశారా? లేక మరో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. భీష్మ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
మరి గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అందిస్తాయో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: