స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమాని ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో టబు, జయరామ్, రాజేంద్రప్రసాద్, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, సునీల్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. కాగా… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి… ఓవర్సీస్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని ట్రేడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఓవర్సీస్లో బన్నీకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అక్కడ ‘అల…’ రైట్స్ దాదాపు రూ.8.5 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో… ఇంత పెద్ద మొత్తంలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. ఏదేమైనా, ‘అల వైకుంఠపురములో’ ఓవర్సీస్ బిజినెస్ డీల్ గురించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘అల వైకుంఠపురము’లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రచారం సాగుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: