“కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్లకూడదు. మనసు వెళ్ళిన చోటి కల్లా మనిషి వెళ్లకూడదు!”… ఈ పాయింట్తో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం `శుభలగ్నం`. సిరి మైకంలో కట్టుకున్న భర్తని కూడా అమ్ముకుని… ఆనక తప్పుని సరిదిద్దుకునే ఓ మగువ కథతో ‘శుభలగ్నం’ తెరకెక్కింది. జగపతిబాబు, ఆమని, రోజా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించాడు. సుహాసిని, కోట శ్రీనివాసరావు, ఏవీయస్, గుమ్మడి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, గుండు హనుమంతరావు, అలీ, సుబ్బరాయ శర్మ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా… సౌందర్య ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భూపతిరాజా, ఎస్వీ కృష్ణారెడ్డి సంయుక్తంగా అందించిన కథకు దివాకర్బాబు సంభాషణలు సమకూర్చారు. సుహాసిని, ఆమని కాంబినేషన్లో వచ్చే డైలాగ్స్ అన్నీ ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి స్వరసారథ్యంలో రూపొందిన పాటల్లో… “చిలకా ఏ తోడు లేక” చిత్ర కథను ఆవిష్కరించేలా ఉంటుంది. `సిరివెన్నెల` సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రం ప్రాణం పోసింది.
పలు నంది, ఫిల్మ్ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకున్న `శుభలగ్నం`… తమిళంలో ‘ఇరట్టై రోజా’, కన్నడంలో ‘గంగా యమునా’, మలయాళంలో ‘సుందర పురుషన్’, హిందీలో ‘జుదాయి’ టైటిల్స్తో రీమేక్ అయింది. అగ్ర నిర్మాత సి. అశ్వనీదత్ సమర్పణలో శ్రీ ప్రియాంక పిక్చర్స్ పతాకంపై కె.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1994 సెప్టెంబర్ 25న విడుదలైన ‘శుభలగ్నం’… నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: