హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది తాప్సీ. అంతే కాదు అక్కడ తాను చేస్తున్న సినిమాలు కూడా వరుస విజయాలు దక్కించుకుంటున్నాయి. ఇటీవలే తాను నటించిన మిషన్ మంగళ్ సినిమా కూడా హిట్ అయింది. ఇక ప్రస్తుతం తను ‘సాండ్ కీ ఆంఖ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో షూటర్ దాదీస్గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు మహిళల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాగా తుషార్ హీరానందని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మార్ నిర్మిస్తున్నారు.
దీనితోపాటు ఆకర్ష్ ఖురాన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో గుజరాత్ అథ్లెట్ రష్మీ బయోపిక్ చేస్తుంది. ‘రష్మీ ద రాకెట్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ చిత్రానికి రోనీ స్క్రూవాల్లా నిర్మాత.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: