‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో తొలి విజయాన్ని అందుకున్న నిధి అగర్వాల్… ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్లో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్టు టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగా హీరో సాయి తేజ్, ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. సుబ్బు దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా… వారిలో ఒకరిగా నిధిని ఎంపిక చేసినట్టు సమాచారం. కాగా… తేజ్ నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ పూర్తైన తరువాతే… ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలిసింది. త్వరలోనే నిధి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే… తేజ్ నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: