యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం `జోష్`(2009). ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ఈ సినిమాని నిర్మించారు. `జోష్` కమర్షియల్గా మెప్పించకపోయినా… నటుడిగా చైతూకి మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. కాగా… `జోష్` తరువాత చైతూ, రాజు కాంబినేషన్లో పదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరో సినిమా రాబోతోంది. `జోష్` చిత్రంతో వాసు వర్మ దర్శకుడిగా పరిచయం కాగా… అప్ కమింగ్ ప్రాజెక్ట్ తో శశి నిర్దేశకుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో పట్టాలెక్కనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… ఈ చిత్రంలో నాగచైతన్యకి జోడీగా టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుందని… రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ మూవీకి `అదే నువ్వు అదే నేను` అనే టైటిల్ని ఖరారు చేశారని తెలిసింది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: