ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అలానే అప్పుడప్పుడు అవేర్ నెస్ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా మరో విషయంలో మహేష్ అవేర్ నెస్ చేయడం ఆశ్ఛర్యం కలిగిస్తుంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? ‘చక్రసిద్ద్ నాడీ వైద్యం’ గురించి. కాస్త ఆశ్ఛర్యంగా ఉన్నా.. ఈ వైద్యం వల్ల తనకు కలిగిన లాభం ఏంటో తెలియచేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి సెలబ్రిటీలు కదా వారికేం సమస్యలు ఉంటాయిలే అనుకుంటాం. కానీ వారికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అలా మహేష్ ఒకప్పుడు విపరీతమైన మైగ్రేన్ సమస్యతో బాధపడ్డారట. అయితే దానికోసం ఆయన చాలా మెడిసిన్ తీసుకున్నా కూడా ఎలాంటి లాభం లేకుండా పోయిందంటా.. అయితే ఒక సందర్భంలో నమ్రత డాక్టర్ సత్య సింధూజను కలవడం జరిగింది. ఆ తర్వాత తను నా సమస్య గురించి చెప్పడం.. ఆమె నాకు చక్రసిద్ద నాడీ వైద్యంతో చికిత్స చేయడంతో నాకు తగ్గిపోయింది అని చెప్పాడు.
నేను సత్య సింధూజ వద్ద చికిత్స తీసుకున్నాక అసలు మైగ్రేన్ వల్ల టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎలాంటి టాబ్లెట్లు తీసుకోకుండా ఇతర చికిత్సల ద్వారా అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చనేది నేను నమ్మే సిద్ధాంతం. నాలాగా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారికి ఎలా నివారించుకోవాలో తెలియాలనే నేను ఈ విషయాన్ని మీడియా ముంద మాట్లాడటానికి ఒప్పుకొన్నాను అని తెలియజేసారు. ఎన్ని చికిత్సలు తీసుకున్నా మైగ్రేన్ వల్ల చాలా కాలంగా బాధపడుతున్నవారు ఒకసారి చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి తెలుసుకోండి. నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను కాబట్టి మీరూ కోలుకుంటారన్న నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు మహేశ్. మరి మీరు కూడా మహేష్ ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే కింద వీడియో ను చూడండి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: