వరుస ప్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు సాయి తేజ్. చాలా కథలు విన్న తర్వాత మారుతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రతిరోజూ పండగే అన్న టైటిల్ తో ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకోగా క్రిస్మస్ పండుగా నేపథ్యంలో డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. రేపు ఉదయం 8 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ సినిమాలకు తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాటిలో ఒక చిత్రాన్ని `వెంకటాద్రి ఎక్స్ప్రెస్`, `ఎక్స్ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనుండగా… మరో సినిమాని సుబ్బు అనే నూతన దర్శకుడు రూపొందించనున్నాడని తెలిసింది. మేర్లపాక గాంధీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుండగా… సుబ్బు కాంబినేషన్ మూవీని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా దేవ్ కట్టా తో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. మరి చూద్దాం వీటిలో ఏ సినిమా పట్టాలెక్కుతుందో..? ఎవరితో సినిమా చేస్తాడో..? క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: