‘దేవత’(1982) సినిమాలోని… “ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో”… అనే పాట ఎంతగా ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేటూరి సుందరరామమూర్తి రచనకి చక్రవర్తి స్వరకల్పన తోడై వీనుల విందుగా నిలచిపోయిన ఈ గీతాన్ని… తనదైన మార్కు పిక్చరైజేషన్తో కనువిందుగా తెరకెక్కించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. శోభన్బాబు, శ్రీదేవిపై చిత్రీకరించిన ఈ ఎవర్గ్రీన్ సాంగ్ను… ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రం కోసం రీమిక్స్ చేయనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్గా ‘వాల్మీకి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం… రాజమండ్రిలోని గోదావరి నదీ ప్రాంతాల్లో వరుణ్, పూజపై ఈ పాటను (రీమిక్స్) చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్… సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: